విధుల్లో చేరండి.. ఇంత కంటే నేనేం చెప్పను

విధుల్లో చేరండి.. ఇంత కంటే నేనేం చెప్పను
: :
  • జేపీఎస్​లకు మంత్రి ఎర్రబెల్లి స్వీట్​ వార్నింగ్​
  • విధుల్లో చేరితో సీఎంతో మాట్లాడుతానన్న మంత్రి
  • సమ్మెకు వెళ్లి తప్పు చేశారంటూ వ్యాఖ్య

సమ్మెలో ఉన్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు స్వీట్​ వార్నింగ్​ జారీ చేశారు. సమ్మె విరమించి, విధుల్లో చేరాలని, చివరి అవకాశంగా తాను మాట్లాడుతున్నానని, ఇప్పటికే అంతా తప్పు చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశించినట్లుగా వెంటనే సమ్మె విరమించి, విధుల్లో చేరితేనే తాను సీఎం కేసీఆర్​తో మాట్లాడుతానని, ఇది చివరి హెచ్చరిక అంటూ సూచించారు. అయితే, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేమని, తమను క్రమబద్దీకరించాలంటూ జేపీఎస్​లు వేడుకున్నారు. ముందు సమ్మె విరమిస్తేనే తాను సాయం చేస్తానని, లేకుంటే తానేమీ చేయలేనని, జేపీఎస్​ల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి వారికి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

Also Read: మేం సచ్చిపోతాం.. మీదే బాధ్యత