విధుల్లో చేరండి.. ఇంత కంటే నేనేం చెప్పను
![విధుల్లో చేరండి.. ఇంత కంటే నేనేం చెప్పను](https://mudranews.in/uploads/images/2023/05/image_533x300_645a56586a29d.jpg)
- జేపీఎస్లకు మంత్రి ఎర్రబెల్లి స్వీట్ వార్నింగ్
- విధుల్లో చేరితో సీఎంతో మాట్లాడుతానన్న మంత్రి
- సమ్మెకు వెళ్లి తప్పు చేశారంటూ వ్యాఖ్య
సమ్మెలో ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వీట్ వార్నింగ్ జారీ చేశారు. సమ్మె విరమించి, విధుల్లో చేరాలని, చివరి అవకాశంగా తాను మాట్లాడుతున్నానని, ఇప్పటికే అంతా తప్పు చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశించినట్లుగా వెంటనే సమ్మె విరమించి, విధుల్లో చేరితేనే తాను సీఎం కేసీఆర్తో మాట్లాడుతానని, ఇది చివరి హెచ్చరిక అంటూ సూచించారు. అయితే, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేమని, తమను క్రమబద్దీకరించాలంటూ జేపీఎస్లు వేడుకున్నారు. ముందు సమ్మె విరమిస్తేనే తాను సాయం చేస్తానని, లేకుంటే తానేమీ చేయలేనని, జేపీఎస్ల విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారని మంత్రి వారికి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రతినిధులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
Also Read: మేం సచ్చిపోతాం.. మీదే బాధ్యత