ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ముద్ర, ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్లో డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు, ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ శ్రీనివాస్, ఏఎంహెచ్ఓ మైత్రేయి, ఏసిపి మంజుల సింగ్ ఇతర శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.