తెలంగాణ ఎంసెట్‌- ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు 

తెలంగాణ ఎంసెట్‌- ఫలితాల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్ధులు 

తెలంగాణ ఎంసెట్‌-2023 ఫలితాలు గురువారం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్‌ ఫలితాల్లో టాప్‌ 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్ధులు కైవసం చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో ఫస్ట్‌ ర్యాంక్‌ (158.89) సాధించిన అనిరుద్‌ సనపల్ల.. విశాఖపట్నంకి చెందినవాడు. సెకండ్‌ ర్యాంక్‌ (156.59)లో నిలిచిన ఎక్కంటిపాని వెంకట మనిందర్‌ రెడ్డి గుంటూరుకు చెందిన విద్యార్ధి. మూడో ర్యాంక్‌ (156.94) సాధించిన చల్లా రమేష్ కృష్ణా జిల్లా నందిగామ వాసి. టాప్‌ మూడు ర్యాంకర్లు ఆంధ్రా విద్యార్ధులు కొల్లగొట్టడం విశేషం. ఇక నాల్గవ ర్యాంక్‌ అభినిత్ మంజేటి (156.58) తెలంగాణ కొండాపూర్‌, 5వ ర్యాంక్‌ ప్రమోద్‌ కుమార్‌ తాడిపత్రికి చెందినవాడు. 

అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్‌ ర్యాంకర్లు
అగ్రికల్చర్‌, ఫార్మసీలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన బురుగుపల్లి సత్య ఈస్ట్ గోదావరికి చెందినవాడు. చీరాలకు చెందిన నాసిక వెంకట తేజ రెండో ర్యాంక్‌, తెలంగాణలోని రంగారెడ్డికి చెందిన సఫల్‌ లక్ష్మి పసుపులేటి మూడో ర్యాంక్‌, తెనాలికి చెందిన దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి నాల్గవ ర్యాంక్‌ , శ్రీకాకుళంకు చెందిన బోర వరున్‌ చక్రవర్తి 5వ ర్యాంకు సాధించారు.  తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలు హవా చాటారు. ఇంజనీరింగ్‌, అగ్రకల్చర్ స్ట్రీమ్‌లలో టాప్‌ ర్యాంకులన్నీ అబ్బాయిలే సాధించారు.రానున్న రెండు మూడు రోజుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సబిత వెల్లడించారు.