మంత్రి కేటీఆర్ ను కలిసిన చల్మెడ 

మంత్రి కేటీఆర్ ను కలిసిన చల్మెడ 

ముద్ర, వేములవాడ: బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐ.టి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల చైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహ రావు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వేములవాడ  నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి కేటీఆర్ వేములవాడ నియోజకవర్గ పర్యటనపై చర్చించినట్లు సమాచారం. అయితే కలయికలో భాగంగా ఏ.ఏ అంశాలపై చర్చించారో అనే దానిపై సందిగ్ధత నెలకొంది. అదే క్రమంలో  ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.