తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరుకాలేకపోతున్న... సోనియా గాంధీ

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరుకాలేకపోతున్న... సోనియా గాంధీ

ముద్ర,తెలంగాణ:-జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. అయితే, జూన్ 2 వేడుకలకు రావడం లేదని తెలంగాణ నేతలకు సోనియాగాంధీ కార్యాలయం సమాచారం ఇచ్చింది.ఈ వేడుకలకు తన సందేశాన్ని పంపనున్నారు సోనియా గాంధీ. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ వస్తారని కాంగ్రెస్ నేతలు భావించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఇప్పటికే సీఈసీ షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. సికింద్రాబాద్‌‌ లోని పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో వేడుకలు నిర్వహించేందుకు రేవంత్  సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.