కనకమామిడిలో వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణోత్సవం

కనకమామిడిలో వైభవంగా శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణోత్సవం
ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి సందర్భంగా ఆదివారంనాడు శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. వివిధ రకాల పూలతో గోదాదేవిని, శ్రీ రంగనాథ స్వామిని విశేషంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంతరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.