తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్
![తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642d14088d92e.jpg)
తెలంగాణ హైకోర్టులో బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కరీంనగర్లో అర్థరాత్రి హైడ్రామా జరిగింది. యాదాద్రి జిల్లా బొమ్మ ల రామారం పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పీఎస్వద్ద భారీగా బీజేపీ కార్యకర్తల ఆందోళన సాగుతోంది. పీఎస్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించిన బీజేపీ శ్రేణులు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు...తోపులాట. పీఎస్ ఎదుట భారీగా పోలీసుల మోహరింపు. సీఆర్పీసీ 151 కింద బండి సంజయ్కి పోలీసుల నోటీసు. ఆయన్ని ప్రివెన్షన్ కస్టడీకి తీసుకున్న పోలీసులు. టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కేసులో బండి సంజయ్ అరెస్టు.