ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
  • ఆనందోత్సహంలో మహిళలు

శంకరపట్నం ముద్ర డిసెంబర్ 9:మండలంలోని కేశవపట్నం బస్టాండ్ లో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కాంగ్రెస్ నాయకులు గోపగోని బసవయ్య ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ అన్నారు. పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న మహిళలకు పథకం గురించి వివరించి వారిని బస్సులో కూర్చోబెట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.