కంటి పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి - డాక్టర్లు శంకర్ రెడ్డి, శరత్ బాబు..

కంటి పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి - డాక్టర్లు శంకర్ రెడ్డి, శరత్ బాబు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లిలో నూతనంగా ప్రారంభించిన శరత్ మాక్సి విజన్ ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు బుచ్చిరెడ్డి శంకర్ రెడ్డి, సి. శరత్ బాబు లు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో హన్మకొండలోని శరత్ మాక్సి విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, వరంగల్ సెంట్రల్ రోటరీ అండ్ గ్లోబల్ విజార్డ్స్, ఆపరేషన్ ఐ సైట్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన శరత్ మాక్సి విజన్ ప్రాథమిక కంటి పరీక్ష కేంద్రాన్ని డాక్టర్ బుచ్చిరెడ్డి శంకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ శరీరంలో అత్యంత ప్రాధాన్యత గల కండ్లను ప్రత్యేక శ్రద్ధ కనబరిచి కాపాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ బాబు, డాక్టర్లు ప్రభాకర్,ఫణి మాలిని, ఉమా సింగ్లా, సురెన్ కుమార్, శ్రీకాంత్, కృష్ణ మూర్తి, శ్రీవర్ధన్, వెంకట రాజు, కృష్ణ మూర్తి, కుమారస్వామి, అశోక్ బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.