బీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ బహిష్కరణ..
![బీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ బహిష్కరణ..](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63fcb0655f677.jpg)
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి పట్టణంలోని 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నాగవెల్లి సరళ, రాజలింగమూర్తి దంపతులను బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు కటకం జనార్దన్ సోమవారం తెలిపారు. భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పార్టీని, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నందున, వారి ప్రవర్తనపై పార్టీ కమిటీలో చర్చించి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిల ఆమోదం మేరకు కౌన్సిలర్ దంపతులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకట రాణి, వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, భూపాలపల్లి కౌన్సిలర్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.