రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన భరణి సాయిలోకేశ్ (15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. 

బంజారాహిల్స్ నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్తుండగా సిగ్నల్ వద్ద బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ నడిపిస్తున్న లోకేశ్ ఎగిరి కరెంట్ స్తంభానికి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.