నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదలను ముంచిన ప్రభుత్వం

నీళ్లు నిధులు నియామకాల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదలను ముంచిన ప్రభుత్వం

జోగులాంబ గద్వాల ముద్ర ప్రతినిధి : జిల్లా కేంద్రంలో కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన. కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి. నీళ్లు నిధులు నియామకాల పేరుతొ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేదలను ముంచిన ప్రభుత్వం. ప్రియాంక గాంధీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రేస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన వెంటనే  ఉద్యోగ క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసి నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు.

నిరుద్యోగ డిక్లరేషన్ ఆవిష్కరణ చేసిన ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలుపిన జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి. భవిష్యత్ లో కాంగ్రేస్ పార్టీ కార్యాచరణతో  అన్ని స్థాయిల కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తుందన్నారు.త్వరలో నియోజకవర్గం సమస్యలపై ప్రతి మండల కేంద్రంను సందర్శించే కార్యక్రమంతో ముందుకు వెళ్లే రూట్ మ్యాప్ సిద్ధం చేస్థామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి, రాఘవేంద్ర, ఆనంద్, ఇషాక్, తదితరులు పాల్గొన్నారు.