ఊహకు అందని రీతిలో రిజల్ట్స్...

ఊహకు అందని రీతిలో రిజల్ట్స్...
  • మూడోసారి ముచ్చటగా  సీఎంగా కెసిఆర్...
  • నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు..

ముద్ర, గంభీరావుపేట :ఊహకు అందని రీతిలో రిజల్ట్స్ రాబోతున్నాయని,  ముచ్చటగా మూడోసారి సీఎంగా కేసీఆర్ కాబోతున్నాడని నాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు.  గంభీరావుపేట మండల కేంద్రంలోనీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రవీందర్ రావు మాట్లాడుతూ..ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయని, కేటీఆర్ గెలుపు కోసం అప్పర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.  కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని,  ఇందులో ఎటువంటి సందేహము లేదని అన్నారు. తొమ్మిదినర కాలములో సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాడని అన్నారు.నల్లగొండ  లో ఒకప్పుడు ఫ్లోరోసిస్ సమస్య ఉండేదని,  ఆ సమస్య ఇప్పుడు లేదు అని, ఆనాడు కరెంటు కష్టాలు అనేకంగా ఉండేవని,  నేడు కరెంటు కష్టాలు లేవు అని,  24 గంటల కరెంటు ఇస్తున్నాడని అన్నారు.  పది సంవత్సరాల కాలం వరకు కరెంటుకు ఇబ్బందులు లేకుండా చేశాడని,  కర్ణాటక రాష్ట్రనీకి కరెంటు పంపిణీ చేస్తున్నామని  అన్నారు.సీఎం  కేసిఆర్ అనేక రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశానికే రోల్ మోడల్ గా తయారు చేశాడని, ఇవన్నీ చూసి తెలంగాణ ప్రజానీకం మూడోసారి పట్టం కట్టబోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్ స్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ నారాయణ రావు,ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్  రాజేందర్,బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్,నాయకులు దయాకర్ రావు, లక్ష్మణ్, సురేందర్ రెడ్డి,కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.