పనులు చేపట్టారు శిలాఫలకం మరిచారు

పనులు చేపట్టారు శిలాఫలకం మరిచారు

ముద్ర,తంగళ్లపల్లి: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గత సంవత్సరం నవంబర్ 17 న మండల కేంద్రంలో 10 లక్షల నిధుల వ్యయంతో స్థానిక ప్రజా ప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు.మంత్రి కేటీఆర్ మండల అభివృద్ధికి సహకరిస్తున్నప్పటికి,స్థానిక ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు.ఓపెన్ జిమ్ ప్రారంభించినప్పటికీ శిలాఫలకంపై ప్రోటోకాల్ ప్రకారం పేర్లు నమోదు చేయనప్పటికీ స్థానికులు నిత్యం వ్యాయామం కి వచ్చే యువకులు సైతం దాతల సహకారంతోన లేక ఎవరైనా ప్రతిపక్ష నాయకులు ప్రారంభించారా అని చర్చించుకుంటున్నారు