ధర్మారం గ్రామపంచాయతీలో చోరీ

ధర్మారం గ్రామపంచాయతీలో చోరీ
  • వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మండల ప్రజలు

శంకరపట్నం ముద్ర డిసెంబర్ 30 : ధర్మారం గ్రామపంచాయతీలో బోరు బావి పైపు చోరీకి గురైంది. కాచాపూర్ గ్రామంలో చోరీ ఘటన మరువక ముందే ధర్మారం గ్రామంలో జరగడం మండల ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది.పాలకవర్గం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరు బావి పైపు బోర్ బావి నుండి బయటకు తీసి గ్రామపంచాయతీ ఆవరణలో భద్రపరిచారు.

అది గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు  సోమవారం అర్థరాత్రి దాటాక జనసంచారం లేని సమయం చూశారు. అదే అదునుగా  పైపును   బ్లేడుతో కోసి  చోరీ చేశారన్నారు. ఆ పైపు విలువ దాదాపుగా రూ.30000 వరకు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో పాలకవర్గం పిటిషన్ ఇచ్చినట్లు  తెలిపారు. వరుస చోరీల  పట్ల స్థానిక పోలీసులు అప్రమత్తమై ప్రజలకు భరోసానివ్వాలన్నారు. నిఘా నేత్రాలను ఏర్పాటుచేసి చోరీలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.