రేపు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రేపు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలు చేస్తారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆంక్షలు విధిస్తున్నారు. పీవీ విగ్రహం–నెక్లెస్ రోడ్–ఎన్టీఆర్ మార్గ్–తెలుగు తల్లి ఫ్లై జంక్షన్ మార్గంలో వాహనలకు అనుమతి నిరాకరణ.