వరంగల్ కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైల బదిలీ
![వరంగల్ కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైల బదిలీ](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6474b47134b1f.jpg)
- జనగామ జిల్లాకు ఇద్దరి కెటాయింపు
- జనగామకు జి.అరుణ్, కొడకండ్లకు ఎస్.డేవిడ్
ముద్ర ప్రతినిధి, జనగామ: వరంగల్ కమిషనరేట్ పరిధిలో 12 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ ఏవీ రంగనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జనగామకు జిల్లాకు ఇద్దరు ఎస్సైలను కెటాయించారు. బదిలీ అయిన ఎస్సైలు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.సురేష్ వీఆర్ నుంచి హసన్ పర్తి స్టేషన్కు, భూక్యా చందర్ వీఆర్ నుంచి కేయూసీ, ఏ.ప్రవీణ్ కుమార్ వీఆర్ నుంచి వర్ధన్నపేట పీఎస్కు, బి.రామారావు వర్ధన్నపేట నుంచి హన్మకొండకు, డి.వి ఫణి వీఆర్ నుంచి సుబేదారి స్టేషన్కు, డి.రాజు హన్మకొండ నుంచి టాస్క్ ఫోర్స్ కు బదిలీ అయ్యారు.
జి.అరుణ్ రిపోర్ట్ ఫ్రమ్ భద్రాది కొత్తగూడెం నుంచి జనగామ జిల్లా కేంద్రానికి, అలాగే బి.మాధవ్ వీఆర్ నుంచి మట్టెవాడకు, ఎం.డి గాలిబ్ వీఆర్ నుంచి సుబేదారికి, గాలిబ్ షరీఫ్ వీఆర్ నుంచి ఇంతేజార్ గంజ్ పీఎస్కు, ఎండీ వలీ వీఆర్ నుంచి హసన్పర్తికి, కె.లక్ష్మి భరోసా సెంటర్కు, ఎస్. డేవిడ్ వీఆర్ నుంచి కొడకండ్ల పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు విడుదల చేశారు.