రఘునాథపల్లిలో వీవోఏల నిరసన

రఘునాథపల్లిలో వీవోఏల నిరసన

రఘునాథపల్లి, ముద్ర :  రఘునాథపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీవోఏల శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సంఘం నాయకుడు తాళ్లపల్లి హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన సంఘం అధ్యక్షుడు కుడిదేటి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  20 ఏళ్లుగా వీవోఏలు క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల, గ్రామ సంఘాల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారన్నారు.

వారిని రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించకుండా శ్రమను దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. వీఏవోలకు రూ.36 వేల కనీస వేతనం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గుగులోత్ వీరన్న, కందుకూరి యోనా, నాల్కపల్లి ఐలేశ్, సంపత్, మైనార్టీ సెల్ నాయకులు మహమ్మద్ రఫీ, సాగర్, శ్రీనివాస్, కడారి అనిల్ పాల్గొన్నారు.