ప్రగతి పథంలో పల్లెలు..

ప్రగతి పథంలో పల్లెలు..
  • ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:రాష్ట్రంలోని పల్లెలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం మహిళలకు బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం రేగొండ మండల కేంద్రంలో రూ.20లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.40లక్షలతో  మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల సుందరీకరణ పనులు, నూతనంగా నిర్మించిన ఆదనవు తరగతి గదులను ప్రారంభించారు. రైతు వేదికలో మహిళలకు కుట్టు మిషన్ లను పంపిణి చేశారు. ఆయా గ్రామాల్లో బతుకమ్మ చీరలు, యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. గూడెపల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేసి, కోటి యాభై లక్షలతో అంతర్గత రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.