దళిత బంధు’ నిధులు ఎందుకు రాలే!

  • జడ్పీ మీటింగ్‌లో ‘మారపాక’ మండిపాటు
  • జడ్పీ చైర్మన్‌ నిలదీసిన స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌
  • దాటవేసే ప్రయత్నం చేసిన సంపత్‌రెడ్డి

‌ముద్ర ప్రతినిధి, జనగామ :రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాలకు దళిత బంధు రెండో విడత నిధులు మంజూరయ్యాయి, కానీ జనగామ జిల్లాకు మాత్రం ఎందుకు రాలేదని జిల్లా స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌‌ జడ్పీటీసీ మారపాక రవి ప్రశ్నించారు. దీనిపై జడ్పీ చైర్మన్‌ సంపత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిని జడ్పీ చైర్మన్‌ దాటవేసే ప్రయత్నం చేసినా.. మీరు విని తీరాలని రవి పట్టుబట్టారు. రాష్ట్రంలో దళిత బంధు మంజూరైన జిల్లా పేర్లను చదివి వినిపించి, మన జిల్లాకు జరుగుతున్న జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సొంత పార్టీ లీడరే ఇలా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.