కొండగట్టులో యువకుడు ఆత్మహత్య
ముద్ర, మల్యాల : మండలంలోని కొండగట్టులో కుళ్ళిన మృతదేహం లభ్యమైంది. మెట్ల దారి నుండి వెళ్తున్న భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.కథలాపూర్ కు చెందిన రాము (35) అనే యువకుడు ఆత్మహత్య, మృతదేహం కుళ్ళిన స్థితిలో కుళ్లిపోయి ఉండడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు.