మంత్రి శ్రీధర్ బాబు తోనే మంథని అన్నిరంగల్లో  అభివృద్ధి చెందుతుంది

మంత్రి శ్రీధర్ బాబు తోనే మంథని అన్నిరంగల్లో  అభివృద్ధి చెందుతుంది
  • గ్రామల్లో సిసి రోడ్డు శంకుస్థాపనలో జెడ్పిటిసి చొప్పరి సదానందం


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:-మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే మంథని నియోజకవర్గం అన్నిరంగల్లో  అభివృద్ధి చెందుతుందని, ముత్తారం మాజీ జడ్పిటిసి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం అన్నారు. ముత్తారం మండలంలోని గ్రామాల్లో  సిసి రోడ్డు శంకుస్థాపనలో జడ్పిటిసి  సదానందం  మండలంలోని ఖమ్మంపల్లి, మైదంబండ, సర్వారం గ్రామంలో సిసి రోడ్డు పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర మండలంలో అన్ని గ్రామాలలో 100% సిసి రోడ్లు పూర్తి చేసేందుకు మంత్రి మూడు కోట్లకు పైన నిధులు మంజూరు చేశారని ఆ నిధులతో మండలంలో అన్ని గ్రామాలలో 100% శాతం రోడ్ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు బియ్యాని శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.