అవమానించారు చర్యలు తీసుకోండి 

అవమానించారు చర్యలు తీసుకోండి 
  • జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు చేసిన జడ్పిటిసి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :మండల పరిషత్ సమావేశంలో గౌరవప్రదమైన జెడ్పిటిసి స్థానంలో ఉన్న మమ్మల్ని పిలిచి స్టేజిపై కుర్చీ వేయకుండా అవమానించడమే కాకుండా పోలీసులచే బయటికి గెంటి  వేయడం పై బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో మానకొండూరు నియోజకవర్గ జెడ్పిటిసిలు మంగళవారం జెడ్పి సీఈఓ ను కలసి ఫిర్యాదు చేశారు.

మానకొండూరు మండల పరిషత్ సమావేశానికి ఎంపీపీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు ప్రజా సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సమావేశానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఈ క్రమంలో మానకొండూరు జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ ను పిలిచి డయాస్ పై కూర్చి వేయకుండా అగౌరపరిచారని ఆయన ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో ఎమ్మెల్యేకు జడ్పిటిసి కి మధ్య వాగ్వేద వాగ్వివాదం నెలకొంది దీంతో అక్కడున్న పోలీసులు జెడ్పిటిసిని బయటికి పంపించవేశారు దీంతో ఆగ్రహించిన టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ పరిధిలోని శంకరపట్నం తిమ్మాపూర్ బెజ్జంకి ఇల్లంతకుంట మండలాల జడ్పిటిసి లతో కలిసి జడ్పీ సీఈఓ కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పిటిసిని అవమానించిన ప్రభుత్వ అధికారులను ఎంపీపీ పై తక్షణమే చర్యలు చేపట్టాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన నిబంధనలు మారవని ఇలాంటి నియంత పోకడలను చూస్తూ ఊరుకోమని, ప్రజా ప్రతినిధులమైన మమ్మల్ని గౌరవించాలని లేకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గం జెడ్పిటిసిలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.