బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలే- డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలే- డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్:బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలని, ఒక పార్టీ కి ఓటేస్తే రెండో దానికి వేసినట్టేనని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మయూరి హోటల్, పాత బస్టాండ్, గంగా కాంప్లెక్స్, నారాయణరెడ్డి కాంప్లెక్స్, డాక్టర్స్ లేన్ వాణిజ్య సముదాయాల్లో కాంగ్రెస్ నాయకులు శనివారం ప్రచారం కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు హామీల పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.  ప్రచారంలో భాగంగా స్వీట్ దుకాణంలో జిలేబి పోస్తూ సందడి చేశారు.

అనంతరం మాట్లాడుతూ రూ.2లక్షల రైతు రుణమాఫీ, ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సహాయం అందిస్తామని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ ని మించిన నాయకుడు లేరనీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసానని, సీఎం కెసిఆర్ నమ్మించి మోసం చేశాడని అన్నారు.