బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బూర మల్సూర్ గౌడ్ నియామకం

బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బూర మల్సూర్ గౌడ్ నియామకం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్  చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర మల్సూర్ ని నియమించారు.బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఉద్యమించాలని, సెప్టెంబర్ 10న  నిర్వహించబోయే బీసీల సింహగర్జనకు లక్షలాది మంది బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని ఇది బీసీల ఆత్మగౌరవ సభఅని జాజుల శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.బూర మల్సూర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బీసీ సంక్షేమ సంఘం లో ఉన్నత పదవి ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీసీల అభ్యున్నతకు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పనిచేస్తానని బీసీలకు బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే బీసీలకు గౌరవం దక్కుతుందని  తెలిపారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రం,యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మా,వారికుప్పల మధు,సాధనందం,గణేష్ , భారత్,భాస్కర్,వినయ్
 బీసీ నాయకులు పాల్గొన్నారు.