టిటిడి పాలకమండల సభ్యులు సాముల రాంరెడ్డికి ఆత్మీయ సన్మానం

టిటిడి పాలకమండల సభ్యులు సాముల రాంరెడ్డికి ఆత్మీయ సన్మానం

ముద్ర హుజూర్నగర్ టౌన్: హుజూర్నగర్ పట్టణానికి చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం పట్టణంలో టి యుడబ్ల్యూజే, ఐజేయు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపం ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని రామ్ రెడ్డి హామీ ఇచ్చారు. పేద వర్గాలకు కళ్యాణ మండపం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తామని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్తానన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు,  శ్రీనివాసు, దేవరం వెంకటరెడ్డి, రమేషు, రామకృష్ణ, కోమరాజు అంజయ్య పాల్గొన్నారు.