సాగర్ నీటిని విడుదల చేయాలి...

సాగర్ నీటిని విడుదల చేయాలి...
  • కాంగ్రెస్  మండల  పార్టీ అధ్యక్షుడు
  • ముస్కు శ్రీనివాస్ రెడ్డి

ముద్ర,అనంతగిరి:సాగర్ ఆయకట్టు పరిధిలో రైతులకు సాగుకు నేటి వరకు నీటిని విడుదల చేయక పోవటం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని,వెంటనే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముస్కు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయంపై శుక్రవారం వారు మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణా రాష్టాన్ని సాధించుకున్న తర్వాత కూడా ప్రభుత్వం నీటిని విడుదల చేయడానికి, తాత్సరం చేయడం లో అర్ధం లేదని, రైతులను ఈ విదంగా ఇబ్బంది పెట్టడం పాలకులకు తగదని ఆయన అన్నారు.సాగర్ నీళ్లు రాక, సరైన వర్షాలు కురవక భూగర్భ జలాలలో నీరు అడుగంటి, బోర్లు బావులలో కూడా నీళ్లు రాక వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. కారణాలు చెప్పకుండా వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.