ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన అంగన్వాడీ టీచర్లు.

ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన అంగన్వాడీ టీచర్లు.

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి మళ్లీ MLA  టికెట్ ఇచ్చినందుకు రాష్ట్ర అంగన్వాడి టీచర్లు శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా అంగన్వాడి రాష్ట్ర నాయకురాలు విలాస కవి నిర్మల మాట్లాడుతూ ఎమ్మెల్యేగా మళ్లీటికెట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నదని, మరొకసారి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు నాగలక్ష్మి, ప్రాజెక్టు అధ్యక్షురాలు శాంతారాజ్యం ,సరిత, ఇమాంబి, జయలక్ష్మి పాల్గొన్నారు.