మధ్యాహ్నం ఢిల్లీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
ఢిల్లీకి బయలుదేరిన సీఎం కేసీఆర్. మధ్యాహ్నం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ఆఫీసులో వాస్తు పూజ, నవ చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. 1.05 నిమిషాలకు బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభిస్తారు. నిరాడంబరంగానే ప్రారంభోత్సవం జరుగుతుంది. తక్కువ మందే హాజరవుతారు. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. ఇప్పటికే డిల్లీకి చేరుకున్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, సబిత, సత్యవతి రాథోడ్, ఎంపీలు. 2024 సార్వత్రిక ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఢిల్లీ నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు సాగుతాయి. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణం 20 నెలల్లో పూర్తయింది. 1300 గజాల స్థలంలో 20 వేల చదరపు అడుగుల్లో భవనం నిర్మించారు. జీప్లస్ త్రీ విధానంలో భవనం నిర్మించారు. మొత్తం 5 అంతస్తులు ఉంది. లోయర్గ్రౌండులో మీడియా సమావేశాలు జరుగుతాయి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ ప్రధాన కార్యదర్శల కోసం 4 గదులు కేటాయించారు. ఆ ఫ్లోర్లోనే రిసెప్షన్, క్యాంటీన్ ఉన్నాయి. మొదటి ఫ్లోర్లో పార్టీ అద్యక్షుడి చాంబర్, పేషీ, కాన్ఫరెన్స్ హాలు ఉన్నాయి. ఢిల్లీ పార్టీ కార్యక్రమాల కోసం 2,3 అంతస్తులు కేటాయించారు. ఢిల్లీ పార్టీ నేతలు, కార్యకర్తలు బస చేయడానికి 18 గదులతోపాటు 2 ప్రత్యేక సూట్ రూములు ఏర్పాటు చేశారు.
ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయం దగ్గర మీడియాపై ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతి ఇవ్వని నేతలు. మీడియా ప్రతినిధులను బయటకు పంపేసిన నేతలు, సీఎం సిబ్బంది. కార్యాలయం గేటు బయట కూడా ఉండనివ్వలేదు.