బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు..

బలహీన వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్  బాటలు.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై హర్షం వ్యక్తం చేస్తూ, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి స్థానిక తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ గా తరలి వెళ్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చేవెళ్ళలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ తో సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు చేయూత లభిస్తుందని అన్నారు. దళితులను, అట్టడుగు వర్గాల ప్రజలను మోసం చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు విసిగి పోయి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. దేశంలో శాసన సభ వేదికగా అబద్ధాలు చెప్పిన అబద్దాలు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక్కరేనని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు గిరి నాగభూషణం, బండ శంకర్, తాటి పర్తి రాంచంద్రారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ధర రమేష్ బాబు, కౌన్సిలర్ నక్క జీవన్, కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిరాజోద్దిన్ మన్సూర్, పట్టణ అధ్యక్షుడు నేహాల్ కార్మికశాఖ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు బొల్లి శేఖర్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గుండా మధు, బీరం రాజేష్, రియాజ్, మామిడిపల్లి మహిపాల్, ఇర్ఫాన్, అనిల్, శివ, మధు, అరవింద్,రాజేష్,రాందాస్,ఉదయ్, శేఖర్, నిరంజన్, విష్ణు, బన్నీ,ఉమేష్, రోహిత్, అతాహుల్లా, నదిం పాల్గొన్నారు.