వైభవంగా చాముండేశ్వరి ఆలయ వార్షికోత్సవం
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చిట్కుల్ శివారులోని మoజీర నది ఒడ్డున వెలసిన దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద చాముండేశ్వరి మాత ఆలయ 41వ వార్షికోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు మంజీర నది నుండి నీళ్లు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. హారతి, తీర్థ ప్రసాదం వితరణ చేశారు. హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ప్రభాకర్ శర్మ, సుబ్రహ్మణ్య శర్మ, మోతిలాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.