డిగ్రీ విద్యార్థిని పూజ ఆదృశ్యం

డిగ్రీ విద్యార్థిని పూజ ఆదృశ్యం
  • ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు
  • ఎల్లారెడ్డిపేట  ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పూజ
  • ఎస్సై శేఖర్

ముద్ర,ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామానికి చెందిన నాగం పూజ కనబడటం లేదని శనివారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం రాగట్లపల్లి గ్రామానికి చెందిన నాగం రజిత మోహన్ ల కుమార్తె ఎల్లారెడ్డిపేట ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న నాగం పూజ 19 శుక్రవారం ఉదయం 7 గంటల వరకు ఇంట్లోనే ఉందని అనంతరం తల్లిదండ్రులు వ్యవసాయ నిమిత్తం పొలం పనులకు వెళ్లి తిరిగి 10 గంటలకు ఇంటికి రాగ ఇంట్లో ఉన్న కూతురు పూజ కనబడకపోయేసరికి ఇరుగుపొరుగు వారికి  తమ కూతురి గురించి అడిగి తెలుసుకున్న తర్వాత ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ పేర్కొన్నారు.