ప్రమాదం అంచుల్లో రహదారులు 

ప్రమాదం అంచుల్లో రహదారులు 

ముద్ర,రాయికల్: రాయికల్ నుండి  కోరుట్ల కు వెళ్ళే రహదారిలో ‌ మైతాపూర్ బస్ స్టాప్ వద్ద గతంలో వర్షాల దాటికి ఆర్ అండ్ బి రోడ్డుకు వాహనదారుల భద్రత కోసం పోసిన మట్టి కొట్టుకుపోవడం వల్ల వాహనదారులు భయం గుప్పెట్లో ప్రయాణిస్తున్నారు.ప్రతి రోజు ఈ రహదారి వెంబడి చాలా వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.ఏమాత్రం వాహనం పట్టు కోల్పోయిన ప్రాణాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డుకు ఇరువైపుల మట్టి పోసి వాహనాదారులకు, ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా భద్రత కల్పించగలరని గ్రామ ప్రజలు కోరుతున్నారు.