'లక్ష' కు బారులు..!

'లక్ష' కు బారులు..!

ముద్ర, మల్యాల: బీసీ చేతి కులవృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన లక్ష ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోడానికి ఈ నెల 20 చివరి తేది ప్రకటించడంతో తహసీల్దార్ కార్యాలయం, ఆన్లైన్ సెంటర్ల వద్ద సందడి నెలకొంది. వందలాది మంది ఆశావహులు దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరుతున్నారు. అలాగే కులం, ఆదాయం తప్పనిసరి కావడంతో సోమవారం  తహసీల్దార్ కార్యాలయంలో సర్టిఫికెట్స్ కోసం దరఖాస్తు చేయడానికి వందలాదిగా ఆశావాహులు చేరుకున్నారు. దాదాపు 1000 మందికి పైగా కులం, ఆదాయంకు దరఖాస్తు చేసుకున్నట్లు రెవెన్యూ సిబ్బంది నరేందర్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, సర్టిఫికెట్స్ రావడానికి 3,4 రోజులు టైమ్ పడుతుందని రెవెన్యూ అధికారులు పేర్కొనడంతో ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు.