సెల్ ఫోన్ ల దొంగల గ్యాంగ్ పట్టివేత
దొంగతనం చేసిన 563 సెల్ ఫోన్ లు, మూడు లక్షల నగదు, కారుతో సహా 1.92కోట్ల విలువైన వస్తువుల స్వాధీనం
ముద్ర ప్రతినిధి రంగారెడ్డి : సెల్ ఫోన్ ల దొంగల గ్యాంగ్ని మాదాపూర్ ప్రత్యేక పోలీసులు, రాయదుర్గం పోలీసులు పట్టుకున్నారు. దొంగతనం చేసిన 563 సెల్ ఫోన్ లు, మూడు లక్షల నగదు, కారుతో సహా 1.92కోట్ల విలువైన వస్తువుల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నరు.
ఇందుకు సంబందించి వివరాలు మాదాపూర్ డీసీపీ సందీప్ బుధవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
అయన కథనం ప్రాకారం...రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి వాహనలను తనిఖీ చేస్తున్న సమయం లో ఒక కారులో సెల్ ఫోన్ దొంగతనం విషయం బయటపడింది. కారు లో బాక్స్ లలో వివిధ కంపెనీలకు చెందిన సెల్ ఫోన్ లు, మూడు లక్షల నగదు లబించాయి. కార్ లో వస్తువులను తీసుకు వెళుతున్న కడప జిల్లాకు చెందిన ఎల్బీ నగర్ లో నివాసం ఉంటున్న జి. రామన్ జి ను ఈ విషయం లో విచారణ జరుపగా సెల్ ఫోన్ ల దొంగల గ్యాంగ్ విషయం వెలుగు చూసింది. నింధితుడు రామన్ జీ ని అరెస్ట్ చేసి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు, ముఠాలో మరో ఐదుగురు సభ్యులు పరారీలో ఉన్నారని మాదాపూర్ డీసీపీ సందీప్ తెలిపారు.