వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బీజాపూర్ హైవేపై లారీ తవేరా వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తవేరా డ్రైవర్ అనీఫ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు డాక్టర్లు. క్షతగాత్రులు యాలాల్ మండలం పగిడ్యాల్ కు చెందిన వారు కాగా తవేరా డ్రైవర్ అనీఫ్ చేవెళ్ల మండలం నాగర్ గూడ వాసి.ప్రమాదం అనంతరం తవేరా డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోవడంతో జెసిబి సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు