స్కాన్​ ఐరన్​ పరిశ్రమలో బాయిలర్​ పేలుడు

స్కాన్​ ఐరన్​ పరిశ్రమలో బాయిలర్​ పేలుడు
  • ఏడుగురు  కార్మికులకు గాయాలు
  • రెండు లారీలు ధ్వంసం 

షాద్‌నగర్ , ముద్ర: స్కాన్​ఐరన్ పరిశ్రమలో బాయిలర్ లో పేలడంతో  ఏడుగురు  కార్మికులు గాయపడ్డారు.  అక్కడ ఉన్న  రెండు లారీలు ధ్వంసం అయ్యాయి.  మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గం కొందర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఐరన్ పరిశ్రమలోని బాయిలర్​లో  పేలింది.  ఈ ఘటనలో  గాయపడిన  ఏడుగురు కార్మికుల  పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.   స్కాన్ ఐరన్ పరిశ్రమలో ఐరన్ లారీల లోడ్లు అన్​లోడింగ్​ చేస్తుండగా  పేలుడు సంభవించిందని ప్రత్యక్షసాక్షులు   తెలిపారు.  ఈ ఘటనలో   రెండు లారీలు,  ఇతర సామాన్లు ధ్వంసమైనట్లు  చెబుతున్నారు. సంఘటన స్థలానికి స్ధానిక ఎస్సై కృష్ణయ్య, అగ్నిమాపక అధికారి జగన్ తదితరులు చేరుకొని క్షతగాత్రులను షాద్ నగర్  ఆస్పత్రికి తరలించారు.  ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని  సీఐ  లక్ష్మీరెడ్డి  తెలిపారు.