సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి

సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి
  •  "పల్లె పల్లెకు అవినాష్ రెడ్డి"లోప్రజా సమస్యలను తెలుసుకుంటున్న షాబాద్ జడ్ పి టి సి అవినాష్ రెడ్డి 

ముద్ర, షాబాద్:-సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పల్లె పల్లెకు వెళుతున్నట్లు షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి తెలిపారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, గతంలో పాలించిన పార్టీలు చేయలేని విధంగా ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో సర్వముఖ అభివృద్ధి వేగవంతంగా సాగుతుందని చెప్పారు.పల్లె పల్లెకు అవినాష్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం షాబాద్ మండలం అంతవరం, కురువగూడ,బోడం పహాడ్, అప్పారెడ్డి గూడ గ్రామల్లో  జడ్పీటీసీ అవినాష్ రెడ్డి పర్యటించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతు దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి అంశాలను ప్రజలకు వివరించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అడిగి తెలుసున్నారు.. పలు సమస్యలు గ్రామస్తులు జడ్పీటీసీ అవినాష్ రెడ్డి తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యలను తీర్చేందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం నుండి అందేవిదంగా అందేలా చేస్తాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా  పాల్గొన్నారు.