తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు

ముద్ర,తెలంగాణ బ్యూరో:- ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో రికార్డు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెండ్ వార్నింగ్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలకు తోడు వడగాల్పులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.