బీజేపీ ఎంపీ అభ్యర్థి కాన్వాయ్‌లో నగదు స్వాధీనం...

బీజేపీ ఎంపీ అభ్యర్థి  కాన్వాయ్‌లో నగదు స్వాధీనం...

ముద్ర,తెలంగాణ:- పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని బీజేపీ పార్టీ యోచిస్తున్నది. అందుకు అప్రజాస్వామిక పద్ధతుల్లో ముందుకెళ్తున్నది. తాజాగా జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్‌లో డబ్బులు దొరకడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికల కోడ్ నిబంధనలకు అనుగుణంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

ఇందులో భాగంగా మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బొడ్మాట్ పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేయగా బీబీ పాటిల్ కాన్వాయ్‌లో 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.