బీఆర్ఎస్దూకుడు!
![బీఆర్ఎస్దూకుడు!](https://mudranews.in/uploads/images/2023/10/image_750x_6524ed976ff05.jpg)
- 15న తెలంగాణ భవన్లో అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం
- అదే రోజు బీఫాంల అందజేత.. మేనిఫెస్టో ప్రకటన
- 18 వరకు జిల్లాల్లో సీఎం పర్యటన
- నవంబర్ 9న రెండు చోట్ల కేసీఆర్ నామినేషన్
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో బీఆర్ఎస్పార్టీ వేగంగా వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్అక్టోబర్15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతో ఈనెల 15న కేసీఆర్తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఆయన బీ ఫాంలు అందజేసి.. నామినేషన్లు వేసే సమయంలో తీసుకునే జాగ్రత్తలను, ఎన్నికల నియమావళి, ప్రచార వ్యూహాలను వివరించనున్నారు. అనంతరం బీఆర్ఎస్మేనిఫెస్టోను కేసీఆర్విడుదల చేయనున్నారు. ఇందులో ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు తదితర రైతు, మహిళ, బీసీ, మైనారిటీలు, యువతను ఆకర్షించేలా పలు హామీలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
హుస్నాబాద్ నుంచే..
అక్టోబర్15న హైదరాబాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గాలు, 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదేరోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగా నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సీఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.