మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పా..

మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పా..

హైదరాబాద్ : తాను భావోద్వేగంతో చేసిన వాఖ్యలేనని.. వేరే ఉద్దేశ్యం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.  టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడిపై కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడిన ఆడియోపై ఆయన స్పందించారు. 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో తానెప్పుడూ ప్రత్యర్థులను కానీ.. మరెవరినీ దూషించలేదన్నారు. శత్రువులను కూడా దగ్గర తీసే తత్వం తనదని వెల్లడించారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. చదువుకున్న వ్యక్తి గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్‌కు అవకాశం ఇచ్చామని తెలిపారు.  నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానని వెల్లడించారు. తాను మాట్లాడిన విషయాలు కొన్ని కట్ చేసి.. కొన్ని అంశాలు మాత్రమే లీక్ చేశారన్నారు. రికార్డ్ పెట్టిన విషయం కూడా తనకు తెలుసన్నారు. పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి చెరకు సుధాకర్ తనను తిడుతున్నాడని పేర్కొన్నారు. ఎందుకు తిడుతున్నారని అడగ్గా.. చెరకు సుధాకర్‌పై పీడీయాక్ట్ పెడితే.. తానే కొట్లాడానన్నారు. తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానన్నారు. అన్యధా భావించొద్దని ప్రజలను కోరుతున్నానని కోమటిరెడ్డి తెలిపారు. తనను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లే.. భాధతో మాట్లాడానన్నారు. నకిరేకల్‌లో తనపై పోస్టర్‌లు వేశారని.. ఎవరు వేశారో కూడా తెలుసన్నారు. తన వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పానన్నారు. తనపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కు,ఇంఛార్జి ఠాక్రే ఫిర్యాదు చేశానన్నారు. తనను తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారని వెంకటరెడ్డి పేర్కొన్నారు.