వృద్ధుల భవనానికి నరేందర్ రెడ్డి రూ. లక్ష విరాళం

వృద్ధుల భవనానికి నరేందర్ రెడ్డి రూ. లక్ష విరాళం

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న  వయో వృద్ధుల సంక్షేమ సంఘ ఆశ్రయ భవనానికి బీబీనగర్ ఎంపీటీసీ-2 గోలి నరేందర్ రెడ్డి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాసుల సత్యనారాయణ, యెర్రం మనోహర్, ఆగమయ్య గౌడ్, నరసింహా రెడ్డి, బోర్ర లింగారెడ్డి, సన్నిబోయిన ప్రసాద్, మంగ అశోక్, వీరేశం, ముత్యాలు, శివయ్య తదితరులు పాల్గొన్నారు.