మంత్రి గంగులకు ఆహ్వానం

మంత్రి గంగులకు ఆహ్వానం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ కురుమ సంఘం విద్యార్థి వసతి గృహ ప్రారంభోత్సవానికి రావాలంటూ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ కురుమ సంఘం జిల్లా నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం అనేక సంస్కరణలు చేపట్టిందని వెల్లడించారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీలతో పాటు విదేశీ విద్యను సైతం అందించడానికి ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈనెల 27న ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీస బీరయ్య, కడారి ఐలయ్యలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆహ్వానించిన వారిలో కురుమ రాష్ట్ర కార్యదర్శి ఎల్కపెల్లి లచ్చయ్య కురుమ, దయ్యాల మల్లయ్య కురుమ, అడ్వకేట్ జిల్లా సలహాదారులు చెట్కూరి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు యేగుర్ల అశోక్ కురుమ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది ధర్మయ్య కురుమ, పోలె గట్టయ్య, కురుమ మేకల నర్సయ్య కురుమ పెద్ది భీమరాజ్ కురుమ తదితరులు ఉన్నారు.