అమరావతి అభివృద్ధి కోసమే టీడీపీలోకి కన్నా
మంగళగిరి: అమరావతి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వీడి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్ పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డారు. ''రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. పంటలకు గిట్టుబాటు ధర లభించట్లేదు. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో సంక్షేమం అడ్రస్ లేకుండా పోయింది. కార్పొరేషన్లన్నీ మూసివేసే పరిస్థితి వచ్చింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది'' అని జగన్ సర్కార్పై చంద్రబాబు ధ్వజమెత్తారు.