బీద బిడ్డల బాగు కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ తయారు చేశారు - ఖమ్మంపల్లి లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య   

బీద బిడ్డల బాగు కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ తయారు చేశారు - ఖమ్మంపల్లి లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య   

ముద్ర ముత్తారం: బీద బిడ్డల బాగు కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్టో ను సీఎం కెసీఆర్ తయారు చేశారని  మండలంలోని ఖమ్మంపల్లి లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య అన్నారు. శుక్రవారం ఎంపీటీసీ అల్లం తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల తో కలిసి గ్రామంలో లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మేనిఫెస్టోకు ప్రత్యేక పూజలు చేసి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మేనిఫెస్టో లో పథకాలన్ని అమలు చేసి  గ్రామాల్లోని బీద కుటుంబాలకు మేలు చేస్తామన్నారు.  ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు దినేష్, మాజీ ఎంపిటిసి సుధాకర్, మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య,  నాయకులు విశ్వ రామ్, పందుల వెంకటేష్,  కన్నం సత్తయ్య, కూరాకుల ఓదెలు యాదవ్, రమేష్, జక్కుల ఓదెలు, బానయ్య, రాజయ్య, శంకర్, కుమార్, దిలీప్  రవి, సమ్మయ్య, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.