అంటరానితనం విడనాడాలి - ఎస్ ఐ రాజు గౌడ్

అంటరానితనం విడనాడాలి - ఎస్ ఐ రాజు గౌడ్

సిద్ధిపేట, ముద్ర ప్రతి నిధి : గ్రామంలో కుల మత భేదాలకు తావు ఇవ్వకుండా అందరు కలిసికట్టుగా ఉండాలని, అంటరానితనం విడనాడాలని రాజగోపాల్ పేట ఎస్ఐ రాజు గౌడ్ అన్నారు.  సిద్దిపేట జిల్లా నంగునూర్ మండల పరిధిలోని అంక్షాపూర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజగోపాల్ పేట ఎస్ ఐ రాజుగౌడ్ హజరై ఆయన మాట్లాడుతూ పౌరుని హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉందన్నారు.పౌర హక్కులపై ఎవరైనా‌ పెత్తనం చలాయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ్యాంగం చెప్పిన విధంగా ఎవరి హక్కులను వారు కొనసాగించుకుంటూ గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ లింగం,సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, గ్రామస్తులు పాల్గొన్నారు.