యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర హామీ

యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర హామీ

మొగుళ్లపల్లి, ముద్ర: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయాలని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడారి రమేష్ యాదవ్ నేతృత్వంలో మండలంలోని యాదవ సంఘం నాయకులంతా సోమవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని భూపాలపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. యాదవ సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి యాదవ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చారు.  త్వరలోనే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని, అందుకుగాను తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపినట్లు యాదవ సంఘం నాయకులు తెలిపారు. అడగగానే కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి హామీనిచ్చిన భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర వెంటనే మండలంలోని యాదవ కులస్తులమంతా ఉంటామని వారు ఎమ్మెల్యే గండ్రకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంకుశాపురం సర్పంచ్ గాలి చంద్రమౌళి, గుడిపహాడ్ సర్పంచ్ పాశం సరూప పర్వతాలు, యాదవ సంఘం మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు ఆకుల వీరన్న, మొగుళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు యాదండ్ల మొండయ్య, యాదవ సంఘం నాయకులు భాషిక కుమారస్వామి, కూకట్ల రవి, కోడారి శ్రీనివాస్, మోత్కూరి కుమారస్వామి, కోడారి రవీందర్, దానవేణి అశోక్, కాట్ల శ్రీనివాస్ మరియు వివిధ గ్రామాల యాదవ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.