వైద్యం వికటించి  వ్యక్తి మృతి. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన..

వైద్యం వికటించి  వ్యక్తి మృతి. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన..

ముద్ర, జమ్మికుంట: ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణం లో చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం గోడిశాల గ్రామానికి చెందిన మిడిదొడ్డి బక్కయ్య (55) అనే వ్యక్తి వైద్యం కోసం బుధవారం ఆసుపత్రి లో చేరాడు. అదే రాత్రి వైద్యం వికటించి బక్కయ్య చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బందువుల ఆందోళన చేపట్టారు.