బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం

సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి

చిగురుమామిడి ముద్ర న్యూస్:చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన క్రీడాకారుడు శనిగరం అంజనేయులు గత ఏప్రిల్ నెల 7వ తేదీ నా హుస్నాబాద్ లో క్రికెట్ అడుతు అకస్మాత్తుగా చనిపోయాడు. విషయం తెలుసుకున్న సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ఆంజనేయుని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రముఖ సామాజిక సేవకురాలు మంజుల రెడ్డి సహృదయంతో బాధిత కుటుంబానికి తన సొంత ఖాతా నుండి రెండు లక్షల రూపాయలు చెక్కును అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో తక్షణమే స్పందించి వైద్య సహాయానికి హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించినప్పటికీ శనిగరం ఆంజనేయులు చనిపోయారు.

తదానంతరం మంజులక్క యువసేన సభ్యులు దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇచ్చి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంజుల రెడ్డి ని బాధిత కుటుంబ సభ్యులు ,గ్రామస్తులు అభినందించారు. ఇచ్చినా మాట ప్రకారం బాధిత కుటుంబానికి 2 లక్షల50 వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు సుందరగిరి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, ఉప సర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి, మంజులక్క యువసేన మండల అధ్యక్షులు మంద శ్రీనివాస్, కంది తిరుపతిరెడ్డి,వార్డు సభ్ఒ దిలీప్ కుమార్,కంది శంకర్,నాయకులు తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్, పెసరి శ్రీనివాస్, కొమురయ్య, యువసేన సభ్యులు రవీందర్ రెడ్డి, నరేష్, అవినాష్, సురేష్ గౌడ్, శ్రావణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు